Site icon TeluguMirchi.com

రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదు !

lagadapatiసమైక్యాంద్ర కోసం రాజీనామా చేసే విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తపపటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. సీమాంధ్రకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఈరోజు రాజీనామా చేసే అవకాశం వున్నట్లు భావించినప్పటికినీ.. అది జరగలేదు. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న నాటకీయపరిణామాల మధ్య సీమాంధ్ర ఎంపీలు రాజీనామాల విషయంలో రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్‌ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణలతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. రాజీనామా విషయంలో తొందరపడవద్దని అవసరమైతే.. అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఎంపీ లగడపాటి విలేకరులతో మాట్లాడుతూ.. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. స్పీకర్ మీరాకుమార్ లేకపోవడం వల్ల కలవలేకపోయామని.. మరోసారి స్పీకర్‌ను కలుస్తామన్నారు.

Exit mobile version