నో.. క్లారి’టీ’

lok-sabhaవిభజన బిల్లును ఏ సభలో మొదటగా ప్రవేశపెట్టాలన్న సందిగ్దత ఇంకా కొనసాగుతూనే వుంది. స్వీకర్ మీరాకుమారి అధ్యక్ష్తత జరిగిన లోక్ సభ బీఏసీ సమావేశంలోనూ.. టీ-బిల్లుపై స్పష్టత రాలేదు. టీ-బిల్లుపై బీఏసీలో చర్చించినప్పటినీ.. క్లారిటీ రానట్లు తెలుస్తోంది. దీంతో.. ఈరోజు సాయంత్రం అత్యవసరంగా భేటీకానున్న కాంగ్రెస్ కోర్ కమిటీలోనే టీ-బిల్లు ప్రవేశపెట్టడంపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది. కోర్ కమిటీలో ప్రధానంగా టీ-బిల్లు ఆర్థిక బిల్లా.. ? లేదా.. ? అన్న విషయంపైనే చర్చ జరగనుంది. మరోవైపు, సమైక్యాంధ్ర నిరసనలతో లోక్ సభ రేపటి వాయిదా పడగా, రాజ్యసభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.