Site icon TeluguMirchi.com

’టీ’పై వెనక్కి తగ్గేది లేదు !

telangana-soniagandhiప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో కర్నూలు నేతలు సోనియాను కలిశారు. ఈ సందర్భంగా.. నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరగా, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని సోనియా తేల్చి చెప్పారు. అయితే, మీ ప్రాంత సమస్యలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సీమాంధ్రకు వచ్చే ప్రతి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని ఆమె సూచించారు. విభజనకు సంబంధించిన సమస్యలను వినేందుకు తాము ఆంటోని కమిటీని ఏర్పాటు చేశామని.. మీ సమస్యలు, అభిప్రాయాలను ఆంటోని కమిటీ ముందు చెప్పాలని అధినేత్రి సూచించినట్లు సమాచారం.

Exit mobile version