Site icon TeluguMirchi.com

‘సమైక్య రాష్ట్ర సమితి’ పేరిట కొత్త పార్టీ

samaikaya rastar samitiవిభజన ప్రకటన నేపథ్యంలో సమైక్య రాష్టం పేరుతో సీమాంధ్రలో ఉద్యమం కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విభజన నిర్ణయం కారణంగా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర జిల్లాల్లో భూస్థాపితం కానున్నట్టు అనేక సర్వేలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలే కొత్త పార్టీ పెట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన హోమియోపతి వైద్యుడు ఎస్. విశ్వనాథం తాజాగా ‘సమైక్య రాష్ట్ర సమితి’ పార్టీని స్థాపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు.

Exit mobile version