ఢిల్లీలో సీఎం సీన్.. !!

cmmmmm1రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆశావాహులు ఢిల్లీకి క్యూ కట్టారు. సామాజిక వర్గాల కోణంలో.. చిరంజీవి, కన్నా, బొత్స, పొన్నాల లు ముందు వసరసలో వున్నారు. అయినా.. మరికొందరు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే వున్నారు.

తాజాగా, అధిష్టానం పిలుపు మేరకు సీమాంధ్ర ప్రాంత నేతలు ఢిలీ బయలు దేరివెళ్లారు. కన్నా, కొండ్రు మురళీ ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లారు. మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అధిష్టానం ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపినట్లయితే.. రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు రావడం ఖాయం. మరీ.. ఆ నాలుగో కృష్ణ్డు ఎవరో..?? అంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.