Site icon TeluguMirchi.com

ఉగ్రవాదులకు నవాజ్ షరీఫ్ ఆహ్వానం

nawaz_sharifశాంతి స్థాపన మార్గం లో చర్చలకు రావాల్సిందిగా ఉగ్రవాద సంస్థలకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం పలికారు. పాకిస్తాన్‌ గడ్డ నుంచి తీవ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు అలుపులేని పోరాటం చేస్తామన్నారు. శాంతియుత చర్చలకు రావాలని తీవ్రవాద సంస్థలకు ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. ఆఫ్గనిస్తాన్‌ సరిహద్దుల నుంచి పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలను మూలాలతో సహా పెకలించివేస్తామని హెచ్చరించారు. శాంతి చర్చలను తిరస్కరిస్తున్న ఉగ్రవాద గ్రూపులు తమ విధానం మార్చుకుని చర్చలకు రావాలని షరీఫ్‌ ఆహ్వానం పలికారు.

Exit mobile version