ఉద్యోగులపై నిర్మల సీతారామన్ వరాలు..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉద్యోగులకు తీపి కబురందించారు. ప్రధానంగా మధ్యతరగతి వర్గాల పై పన్నుల భారాన్ని తగ్గించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచడం కోట్లాది మంది ఉద్యోగులకు ఊరట కల్గిస్తుందని నిర్మల సీతారామన్ ఆభిప్రాయపడ్డారు.