Site icon TeluguMirchi.com

జాగ్రత్త..ఉగ్రవాదుల ప్లాన్ ఇదేనట…

కశ్మీర్ విభజన, స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దేశంలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. విమానాశ్రయాలు , రైల్వే స్టేషన్, బస్టాండ్..ఇలా ప్రజలు ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాలలో చాల జాగ్రత్తగా ఉండాలని ప్రకటించింది. మరోపక్క పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్ అజ్గర్ మంగళవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

ముంబై, పంజాబ్‌లలోని పలు రద్దీ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాల్పడటానికి జైషే మహ్మద్ సంస్థ ప్రణాళికలు రచించినట్టు ఐబీ హెచ్చరికల ద్వారా తెలుస్తోంది. ముంబైలో విధ్వసం సృష్టించే బాధ్యతను జైషే మహ్మద్ సంస్థ ముగ్గురు ఉగ్రవాదులుకు అప్పగించినట్లు సమాచారం. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా తనిఖీలు మొదలు పెట్టింది. ప్రతి ఒక్కర్ని క్షణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానితులను అరెస్ట్ చేస్తుంది.

Exit mobile version