Site icon TeluguMirchi.com

దైర్ఘ్యముంటే ఆస్తులను వెల్లడించండి : బాబు

Chandrababuకృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర 1800 కి.మీ మైలురాయిని దాటింది. లగడిపాటి లాంటి కాంగ్రెస్ నేతలు చంద్రబాబు నాయుడు పాదయాత్రను ‘కనువిప్పు’ పేరుతో అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో… పాదయాత్ర ఎలా కొనసాగబోతొందోన్నన ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది. కానీ అందరూ ఊహించిన దానికంటే బాబు పాదయాత్రకు ప్రజలు అశేషంగా తరలివస్తున్నారు.

కృష్ణా జిల్లాలో మూడో రోజు పాదయాత్రలో భాగంగా పెనుగంచిప్రోలు మండలంలో బాబు మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలకు ధైర్యం, దమ్ము ఉంటే 2004కి, ఇప్పటి ఆస్తుల వివరాలు వెల్లడించాలని సవాల్ విసిరారు. ఈ తొమ్మిది సంవత్సరాలలో దోచుకున్నంత దోచుకుని అన్ని ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాల మాఫీ చేస్తామని బాబు హీమి ఇచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి నందిగామ నియోజకవర్గంలోకి ప్రవేశించిన బాబు పాదయాత్ర గుమ్మడిదుర్రు, రామిరెడ్డిపల్లి, కొండూరు, మాగల్లి ప్రాంతాల్లో సాగుతోంది.

Exit mobile version