కృష్ణా జిల్లాలో మూడో రోజు పాదయాత్రలో భాగంగా పెనుగంచిప్రోలు మండలంలో బాబు మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలకు ధైర్యం, దమ్ము ఉంటే 2004కి, ఇప్పటి ఆస్తుల వివరాలు వెల్లడించాలని సవాల్ విసిరారు. ఈ తొమ్మిది సంవత్సరాలలో దోచుకున్నంత దోచుకుని అన్ని ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాల మాఫీ చేస్తామని బాబు హీమి ఇచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి నందిగామ నియోజకవర్గంలోకి ప్రవేశించిన బాబు పాదయాత్ర గుమ్మడిదుర్రు, రామిరెడ్డిపల్లి, కొండూరు, మాగల్లి ప్రాంతాల్లో సాగుతోంది.