తాజాగా, స్వీకర్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాలపై అధ్యయనం చేయడానికి లక్నో బయలుదేరి వెళ్లాడు. విభజన ముసాయిదా బిల్లుపై చర్చ తీరును తెలుసుకోవడానికి లక్నో ఎందుకంటారా.. ? అదేనండీ.. ఉత్తరప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు చర్చ జరిగిన తీరుపై నాదెండ్ల అధ్యయనం చేయనున్నారు. ఆ సమయంలో.. ఉత్తరప్రదేశ్ శాసన సభ అనుసరించిన విధానాన్ని ఓ పరిశీలిస్తారట మన స్వీకర్.
వచ్చే నెల 3వ తేది నుండి టీ-బిల్లుపై హాట్ హాట్ చర్చకు తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈలోగా మన స్వీకర్ చర్చ జరపాల్సిన తీరుపై జర అధ్యయనం చేసి.. సభలో అవే విధానాలను అనుసరించనున్నాడన్న మాట.