ఏపీఎన్జీవోల అఖిలపక్షానికి వెళ్ళం : వై.కాంగ్రెస్

misura reddyఏపీఎన్జీవోల సంఘం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి హాజరు కాబోమని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు వైఎస్‌ఆర్‌ సీపీ నేత మైసూరారెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రెండు పడవలపై ప్రయాణించే పార్టీలతో కలిసి తాము వేదికను పంచుకోలేమని అన్నారు. ప్రజలు కూడా ఇలాంటి సమావేశాలను హర్షించరని లేఖలో తెలిపారు. అయితే ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కి మొదటి నుండి కొన్ని సందేహాలు వున్నాయి. ఈ నేపద్యంలనే వైఎస్‌ఆర్‌ సీపీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే అంశంపై చర్చ నడుస్తుంది.