ఈ నెల 24 లోపు టీబిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగడంపైనే దృష్టినంతా కేంద్రీకరించానని చెప్పారు. సభలో చర్చ జరిగితేనే, ఇరు ప్రాంతాల సమస్యలు తెలుస్తాయని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు బయట మాట్లాడటం, గొడవ చేయడం మానుకోవాలని, సభలోకి వచ్చి చర్చించి, అభిప్రాయాలను తెలియజేస్తే అన్నీ రికార్డవుతాయని చెప్పారు. తాను పార్టీ పెట్టే విషయంపై ఇంకా ఆలోచించలేదని కిరణ్ స్పష్టం చేశారు.