చివరి బంతి అయిపోలేదు: కిరణ్

cm kiranతుపాన్ ఆపలేను గాని విభజన ను ఆపుతానన్న మాటకు కట్టుబడి వున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో సారి స్పష్టం చేశారు. విభజన విషయంలో రాజ్యాంగం ప్రకారమే ముందుకేల్లన్నారు. ఈ రోజు మీడియా తో మాట్లాడిన కిరణ్… ఇతర రాష్ట్రాలలో విభజన చర్చలు జరిగిన తీరుపై అధ్యయనం జరపాలి కోరారు . రాష్ట్రం విడిపోవాలా?వద్దా అన్నది రాష్ట్ర శాసనసబే నిర్ణయించాలని అన్నారు. ఆటలో చివరి బంతి ఇంకా అయిపోలేదని, తానొక పోరాట యోధుడినని, చివరి బంతి వరకు పోరాడుతానని చెప్పారు. బిల్లుపై చర్చ ఎలా కొనసాగాలి అనే అంశాన్ని సభాపతులే నిర్ణయిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంత ప్రజలను మెప్పించే విధంగా సభలో చర్చ జరగాలని అన్నారు.