Site icon TeluguMirchi.com

చంద్రబాబు ‘పోరాడుతున్నట్టు నటించ’మన్నాడా ?

tdp-telangana
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఎన్నడూ లేనంత హైప్ కి చేరింది. హస్తినాలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఇక, ఇదే అంశంపై ఆంధ్రప్రదేష్ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇదంతా.. అధికార టీడీపీ ఓ టర్న్ అంటూ తీసుకోవడంతో మొదలైంది. కేవీపీ ప్రయివేట్ బిల్లుపై చర్చ సందర్భంగా.. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఆ సమయంలో టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరు పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశాడు. వెంటనే ఎంపీలని పిలిచి క్లాస్ పీకి.. గట్టిగా పోరాడలని సూచించారు. ఇక, బాబు నుంచి భరోసా లభించడంతో టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళనని తీవ్రతరం చేశారు.

మరోవైపు, వైసీపీ మాత్రం టీడీపీ నేతలు పోరాడుతున్నట్టు నటిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓ వైపు కేంద్రంలో అదికారం అనుభవిస్తూ.. మరో వైపు పోరాడుతున్నట్లు నటించాలని టీడీపీ ఎంపీలు బావిస్తున్నారని ఒంగోలు వైసిపి ఎంపీ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రజలు వీటిని గమనిస్తున్నారని.. కేంద్రంలో అదికారంలో ఉన్న టిడిపి ప్రదాని మోడీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాదించకుండా, ప్లకార్డులు పట్టుకుంటే ఎవరు నమ్ముతారని వైవీ విమర్శించారు. వైవీ మాటలని బట్టి చూస్తే.. టీడీపీ ఎంపీలు పోరాడుతున్నట్టు నటిస్తున్నారు. అది మరి.. చంద్రబాబు ‘పోరాడుతున్నట్టు నటించ’మన్నాడను కోవాలేమో !

Exit mobile version