Site icon TeluguMirchi.com

విభజిస్తే.. రాజకీయ సన్యాసం..!

lagadapatiరాష్ట్రాన్ని విభజిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని..కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణపై రాష్ట్రాన్ని ప్రకటించడానికి కేంద్రం సిద్ధపడిందని వార్తలొస్తున్ననేపథ్యంలో.. లగడపాటి విలేకరులతో మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం చివరి క్షణం వరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పినదానికి కట్టుబడివున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. 2014లో సమైక్య రాష్ట్రానికే ఎన్నికలు జరుగుతాయన్న ఆశాభావాన్ని లగడపాటి వ్యక్తం చేశారు.

Exit mobile version