అధినేత్రి మాటను ఖాతరు చేయని ఎంపీలు !

Sonia_Gandhiలోక్ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాటలను కూడా కాంగ్రెస్ ఎంపీలు లెక్కచేయడం లేదు. సమైక్య నినాదాలు చేస్తూ.. వెల్ లోనికి దూసుకెళ్తున్న కాంగ్రెస్ ఎంపీలను సోనియా వారించారు. అయిననూ.. అధినేత్రి మాటలను లెక్కచేయకుండా ఎంపీలు లగడపాటి, హర్షకుమార్, నిమ్మల కిష్టప్ప, ఎస్పీవై రెడ్డి, బాపిరెడ్డిలు వెల్ లోనికి దూసుకెళ్లారు. దీంతో సభ సమైక్య నినాదాలతో మారుమ్రోగింది. గతంలో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలో కూడా తెలంగాణ ఎంపీలు అధినేత్రి మాటకు కట్టుబడి సభలో తగ్గివున్న విషయం తెలిసిందే. కానీ, తాజాగా సీమాంధ్ర ఎంపీలు మాత్రం అధినేత్రిని ఏమాత్రం ఖాతరు చేయకుండా సభలో నిరసనలు కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.