Site icon TeluguMirchi.com

కబ్జా భూములను స్వాధీనం చేయండి

moahnabbu
సినీనటుడు మోహన్ బాబు బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తెలుంగాణలో పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్భంగా ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తెలంగాణలో భూములు చాలావరకు కబ్జాకు గురయ్యాయని, వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని మోహన్ బాబు కేసీఆర్‌కి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి, గెలిచిన ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ కు కేసీఆర్ ఆప్తుడని గుర్తు చేశారు.

Exit mobile version