జైరాం రమేష్ కు మోడీ ఆహ్వానం!

modiకేంద్రమంత్రి మంత్రి జైరాం రమేష్ ని బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ నెల30న నిర్వహించదలచిన సర్ధార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం ’స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ప్రతిస్టాపన భూమిపూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీ ఆయనను ఆహ్వానించారు. ఆ విగ్రహం భారతదేశ సంస్కృతి, సాంఘిక జీవనానికి మైలురాయి వంటిది కనుక అన్ని రంగాలకు చెందిన ప్రముఖులందరూ.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుకుంటున్నట్లు మోడీ ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున కాకుండా.. సర్థార్ వల్లాభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం. కాగా, అవకాశం దొరికితే.. తనపై మిమర్శనాస్త్రాలు సంధించే జై రాం రమేష్ ను మోడీ తెలివిగా.. తన ఆహ్వాన లేఖతో ద్వారా సందిగ్ధంలో పడేలా చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.