కొత్త గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. యూపీఏ-2లో నియమితులైన గవర్నర్లు కొందరు ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో.. భాజాపా సీనియర్ నేతలను గవర్నర్లుగా నియమిస్తూ మోడీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రాల వారీగా కొత్తగా గవర్నర్లుగా నియమితులైన వారి వివరాలు :
* కర్నాటక – వజ్ బాయ్ రుద్రవాలా (గుజరాత్ స్పీకర్)
* రాజస్థాన్ – కళ్యాణ్సింగ్
* గోవా – మృదుల సిన్హా
* మహారాష్ట్ర – చెన్నమనేని విద్యాసాగర్రావులు నియమితులయ్యారు