Site icon TeluguMirchi.com

కర్ణాటకలో మోడీ ప్రచారం..!

modi-election-compaign-in-kకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నారు. మే 5న జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే.. భాజపా స్థానిక నేతలు తమదైన ప్రచారాన్ని ప్రారంభించారు. గత సంవత్సరం కర్ణాటక బీజేపీ నుంచి యెడ్డీ బయటకు వెళ్లి సొంతపార్టీ పెట్టుకున్నారు. మరోవైపు ఇటీవల అక్కడి పుర పాలక ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో… అక్కడ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. 2014 ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న మోడీతో కర్ణాటకలో ఎన్నికల్లో ప్రచారం చేయించడం ద్వారా.. విజయవకాశాలను మెరుగుపరచుకోవచ్చని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్ర నేతలు కోరడం, వారు ఆమోదించడం జరిగింది. దీంతో ఈనెల 23 అనంతరం ఎప్పుడైనా మోడీ ప్రచారం ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 15 ప్రాంతాల్లో మోడీ ప్రచారానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ… ఆ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ముందు వరుసలో నిలబెట్టిన సంగతి తెలిసిందే.

Exit mobile version