ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా !

verasiva-reddyసమైక్యాంధ్రకు మద్దతుగా అప్పుడే రాజీనామాల పర్వం మొదలైంది. సీమాంధ్రకు మద్దతుగా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఈరోజు (గురువారం) ఉదయంరాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్ లో ఎమ్మెల్యే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీరశివారెడ్ది విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా మాట్లాడి కాంగ్రెస్ ను దోషిగా చూపాయని ఆరోపించారు. విభజనకు వ్యతిరేకంగా.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.