మంత్రుల భార్యల సమైక్య రాగం !

mps-wivesసమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర మంత్రుల భార్యలు సైతం గొత్తెత్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరుతూ.. వీరు ఈరోజు ఉదయం గవర్నర్ నరసింహన్ ను కలసి వినతి పత్రాన్ని అందజేశారు. రాజధానిగా వున్న హైదరాబాద్ లోనే అన్ని సదుపాయాలు, అవకాశాలున్నాయని, సీమాంధ్రలో కనీసం సరైన ఆసుపత్రి కూడా లేదని, పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని..ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోవడం సరికాదని మంత్రుల భార్యలు అభిప్రాయపడ్డారు. వెంటనే విభజన ప్రక్రియను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.