మంత్రుల మంతనాలు !

seemandra-leadersరాష్ట్ర ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో సీమాంధ్ర మంత్రులు ఈ ఉదయం సమావేశమయ్యారు. 63 రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య నిరసనలు, విభజనపై వెనక్కి తగ్గేదిలేదంటున్న కేంద్రం ప్రకటనలపై మంత్రులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాబోతుందన్న ఊహాగానాలపై కూడా మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కేంద్రమంత్రి చిరంజీవి.. రాష్ట్ర మంత్రులు వట్టి వసంతకుమార్, సి. రామచంద్రయ్య, బాలరాజు, మహీధర్ రెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఒకవేళ టీ-నోట్ కేబినెట్ ముందుకు వస్తే.. ఏవిధంగా స్పందించాలన్న దానిపై కూడా మంత్రులు చర్చినట్లు తెలుస్తోంది.