11న సమావేశం కానున్న మంత్రుల బృందం

Suseel-kumar-Shindeరాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈనెల 11న సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంత్రుల బృందానికి నాయకత్వం వహించనున్నారు. మంత్రుల బృందానికి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వం వహించాల్సివున్నప్పతికినీ.. ఆయన ఆరోగ్యం బాగులేని యెడల ఆ బాధ్యతలను షిండేకు అప్పగించినట్లు సమాచారం. కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో వున్న మంత్రులందరూ కూడా సోనియాకు నమ్మకస్తులు కావడం విశేషం. మంత్రుల బృందం నుంచి కొన్ని ముఖ్యశాఖలను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. విద్యుత్‌శాఖ, జలవనరులు, పట్టనాభివృద్ది, న్యాయశాఖ, మానవవనరుల శాఖ, ప్లానింగ్ కమిషన్‌ను తొలగించినట్లు సమాచారం.