మంత్రులకు విభజన సెగ.. !

C-Ramachandraiahతెలంగాణ సెగ ఇంకా తెల్లారిందో లేదో తెలియదు గానీ.. అప్పుడే సమైక్యాంధ్ర సెగ మొదలైంది. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలంటూ.. పలువురి నేతల ఇళ్లను విద్యార్ధి జేఏసీ ముట్టడించింది. ఇప్పటికే విద్యార్థులు మంత్రి సి. రామచంద్రయ్య ఇంటిని ముట్టడించారు. అలాగే టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కు సెగ తప్పలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే పదవులకు రాజీనామాలు చేయాలని విద్యార్ధి జేఏసీ డిమాండు చేసింది. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. సీబ్ల్యూసీ మీటింగు తర్వాత తన స్పందన తెలియజేస్తామని స్పష్టం చేశారు. అయితే, మొన్నటి వరకు సపరేట్ తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ మంత్రులకు చుక్కులు చూపించారు టీ-జేఏసీ విద్యార్థులు. ఇక ఇప్పుడు సమైక్య మంత్రులకు స్టార్టయింది టార్చర్.. మరి మంత్రులు రాజీనామా చేసి విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లారుస్తారా.. లేదా బలవుతారా వేచి చూడాలి.