విభజనతో నీటి సమస్యలుండవ్.. !

Sudarshan-Reddy-P.jpjరాష్ట్రం విభజన జరిగితే ఎలాంటి నీటి సమస్యలు రావని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. విభజన జరిగితే.. హైదరాబాద్ సమస్యతో పాటుగా, భవిష్యత్ లో నీటి యుద్దాలు తప్పవని ఇటీవల ముఖ్యమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో.. తాజాగా, నీటిపారుదల శాఖమంత్రి అయిన సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధ్యాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రం విడిపోతే.. తమ పంటలు ఎండిపోతాయని, తమకు నీరు రాదని వాదింస్తున్న వారి వాదనలో వాస్తవం లేదని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణలోని ప్రాజెక్టులను కూడా పూర్తచేయడానికి కృషిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మరీ విభజన జరిగితే.. నీటి సమస్యలు వస్తాయన్న ముఖ్యమంత్రి, తాజాగా, సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.