Site icon TeluguMirchi.com

భేటీకి ముందే కానిచ్చేస్తారట..!

sailajanath-ministerతెలంగాణ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కంటే ముందే సమైక్యాంధ్ర సభను నిర్వహిస్తామని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. అనంతపురంలో ఈరోజు మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పరిస్థితి ఎలావుంటుందని తెలుసుకోవాలంటే మన పక్క రాష్ట్రాలను చూడాలన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని.. తాను నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు. తాము నిర్వహించబోయే సమైక్యాంధ్ర సభతో కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిలో మార్పు వస్తుందన్న ఆశాభావాన్ని శైలజానాథ్ వ్యక్తం చేశారు.

Exit mobile version