సీఎం వైఖరిలో తప్పులేదు !

sailajanath-ministerకిరణ్ కొందరు మంత్రులు మద్దతు పలుకున్నారు. సమైక్యాంధ్రకు మాత్రమే కిరణ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాంటూ.. ఇటీవల పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు విరుచుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మంత్రి శైలాజనాథ్ కిరణ్ కు అండగా నిలిచారు. ఈరోజు శైలాజానాథ్ విలేకరులతో మాట్లాడుతూ.. కిరణ్‌ సమైక్యాంధ్ర సీఎంమేనని వ్యాఖ్యనించారు. అయితే, సమైక్యాంధ్ర కోసం సీఎం పదవిని సైతం త్యాగం చేస్తానని కిరణ్ ఏనాడో ప్రకటించారని శైలాజానాథ్ చెప్పుకొచ్చారు. సొంతంగా పార్టీ పెడతానని సీఎం ఎప్పుడు చెప్పలేదని… కాంగ్రెస్‌ కార్యకర్తగా కొనసాగుతానని చాలా స్పష్టంగా చెప్పారని మంత్రి అన్నారు. రాష్ట్ర విభజనలో సంప్రదాయాలు పాటించాలంటూ రాష్ట్రపతి, ప్రధానికి సీఎం లేఖ రాయడంలో తప్పులేదని ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికీ విభజన జరుగదనే నమ్మకం తమకు ఆయన స్పష్టం చేశారు.