ఎంఐఎం అభ్యర్థులు వీరే

mimహైదరాబాదులో పోటీ చేయబోయే శాసనసభ అభ్యర్థుల జాబితాను ఎంఐఎం పార్టీ ఖరారు చేసింది. ఏడుగురు అభ్యర్థులతో కూడిన జాబితా విడదల చేసింది. ఎంఐఎం పార్టీ తరపున నాంపల్లిలో మిరాజ్ హుస్సేన్, కార్వాన్ లో కౌసర్ మొహిద్దీన్, చార్మినార్ నుంచి పాషాఖాద్రీ, చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, యాకుత్ పురా నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, బహదూర్ పుర నుంచి మోజంఖాన్, మలక్ పేట నుంచి అహ్మద్ బలాల పోటీ చేయనున్నట్టు ఎంఐఎం తెలిపింది.