Site icon TeluguMirchi.com

యూపీలో రాష్ర్టపతి పాలన !

mayawatiయూపీలో రాష్ర్టపతి పాలనను విధించాలని బీఎస్పీ అధినేత్రి మాయవతి డిమాండ్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని యూపీ సర్కార్ లో శాంతి భద్రతల సమస్యతో.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. యూపీలో రాష్ట్రపతి పాలన నిర్వహించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని ఆమె ఉత్తర ప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషిని కోరారు. ఈ మేరకు మాయవతి ఓ వినతి పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు. అసమర్ధ ప్రభుత్వం వల్ల యూపీలో దోపిడీ, కిడ్నాప్ లతో బాటు మహిళలపై దురాగతాలు కూడా చోటుచేసుకుంటున్నాయని మాయ తన మెమోరాండమ్ లో పేర్కొన్నారు. ఇలాంటి దుర్మాగాలు జరిగినప్పటికినీ.. అఖిలేష్ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయకపోవడం అటుంచితే, కనీసం ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేయలేని స్థితిలో ఉందని మాయావతి విమర్శించారు.

Exit mobile version