ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి: మాయావతి

mayavathiయూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమాజ్ వాది పార్టీ విఫలమైందని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ముజఫర్ నగర్ అల్లర్లకు సంబంధించి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని, కనీసం అల్లర్లను అదుపుచేయడంలో కూడా చురుగ్గా వ్యవహరించలేదని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం పాలన చేయలేకపోతుండడంతో అరాచకం రాజ్యమేలకుండా రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె కేంద్రానికి సూచించారు.