దేశం ఎదుర్కొంటున్న ముఖ్యసమస్యల్లో నక్సలిజం ఒకటని.. దీని గురించి ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చాలా సందర్భాల్లో ప్రాస్తావించారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే.. రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి మాటేస్తారని, సరిహద్దులో ఇరు సైన్యాల మధ్య చోటుచేసుకునే కాల్పుల వంటి ఘటనలు.. ఇప్పటికే ఖమ్మం, విశాఖ వంటి ఏజేన్సి ప్రాంతాల్లో వారానికోసారి చోటుచేసుకుంటున్నాయని ఆయన వివరించారు.
ఒకప్ప్పుడు నక్సలిజానికి కంచుకోటలాంటి ఆంధ్రపదేశ్ లో వారిని నియత్రించడానికి రాష్ట్రం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చిందని, దీనికోసం దాదాపు 25 సంవత్సరాలు పట్టిందని అన్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న మావోయిస్ట్ కమిటీలకు సారధ్యం వహిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆంద్రప్రదేశ్ కు చెందినవారేనని, అందులో లంగాణకు చెందినవారే అధికమని.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే.. మరోసారి వారు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలుస్తోంది. గతంలో మావోయిస్ట్ ఘటనలకు బలైన మంత్రి మాధవరెడ్ది, మాజీ స్పీకర్ శ్రీపాదరావు… తదితర ఘటనలు ఉదాహరణలు కిరణ్ పేర్కొనట్లు తెలుస్తోంది. అందుకు గల ప్రభుత్వ గణంకాలను సీఎం కోర్ కమిటీ ముందుంచారు.
మొత్తానికి రాష్ట్రాన్ని విభజిస్తే.. దేశం ఎదుర్కొంటున్న ముఖ్యసమస్యల్లో ఒకటైన నక్సిలిజం తెలంగాణలో మరింతగా పాతుకుపోతుందనే చెప్పడంలో ముఖ్యమంత్రి సఫలీకృతమైనట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. తద్వారా తెలంగాణపై కేంద్రం నిర్ణయాన్ని జాప్యం చేయడంలో సీఎం విజయం సాధించారని సమాచారం.