Site icon TeluguMirchi.com

సత్వర న్యాయం కోసం మరిన్ని న్యాయస్థానాలు: ప్రధాని

manmohanఆదివారం ఢిల్లీలో న్యాయవ్యవస్థలో సమస్యల పరిష్కారంపై సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ.. దేశంలో మహిళలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా మరిన్ని పటిష్ట చట్టాలను తీసుకురావాలని చెప్పారు.సత్వర న్యాయం కోసం దేశంలో మరిన్ని న్యాయస్థానాలు ఏర్పాటు కావాల్సి ఉందని, అలాగే న్యాయమూర్తులను కూడా నియమించాల్సి ఉందని ప్రధాని మన్మోహన్ అన్నారు. ఢిల్లీ అత్యాచార ఘటన తర్వాత న్యాయవ్యవస్థలో ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చిందని.. చట్టంలో లొసుగులను పరిహరించాల్సి వుందని ప్రధాని ఈ సందర్భంగా తెలియజేశారు.

Exit mobile version