Site icon TeluguMirchi.com

మా పాలన ఎన్డీఏ కంటే మెరుగ్గా వుంది: ప్రధాని

manmohanజైపూర్ లో జరుగుతున్న ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ… పేదరిక నిర్మూలనకు యూపీఏ సర్కార్ తీవ్ర కృషి చేస్తోందని.. యూపీఏ ప్రభుత్వ పాలనలో పేదరికం తగ్గుముఖం పట్టిందని అన్నారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని సమ్మిళిత వృద్ధికి యూపీఏ సర్కార్ నిరంతరం ప్రయత్నిస్తుందన్నారు. ఎన్డీఏ పాలన కన్నా తమ పాలన ఎంతో మెరుగ్గా ఉందని, ఎన్డీఏ హయాంలో వృద్ధిరేటు 5.2 శాతం ఉంటే, తమ హయాంలో 8.2 శాతం వృద్ధిరేటు సాదించిందని ప్రధాని తన ప్రసంగం లో పేర్కొన్నారు.

Exit mobile version