Site icon TeluguMirchi.com

నిజాన్ని అంగీకరించిన ప్రధాని!

Manmohan-Singhదేశ ఆర్థిక స్థితి క్లిష్ట పరిస్థితి లో వుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించారు. ప్రస్తుత పరిస్థితితో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు ప్రధాని రాజ్యసభలో అన్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను రేపు రాజ్యసభలో చేస్తామని ఆయన తెలిపారు. ఈ మందగమనానికి మన దేశంలో నెలకొన్న పరిస్థితులు కూడా కొంతవరకు కారణమని మన్మోహన్ సింగ్ చెప్పారు. మరోవైపు, డాలర్ తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంపై లోక్ సభ దద్దరిల్లింది. ఈ నేపధ్యంలో తక్షణమే రూపాయి పతనం పై ప్రాధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

Exit mobile version