ఇక రెండో ముచ్చట కూడా ఉంది. రాను రాను కెసిఆర్ వీకవుతున్నారన్నది. ఆ పార్టీ కూడా మిగితా పార్టీలకు పెద్దగా భిన్నమైనది కాదని, వసూళ్లు, చెక్కులు, కోట్లు, కుట్రలు, కుతంత్రాలు వంటి ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. వీటి ప్రభావం ఇప్పుడే కాకున్నా, కొన్నాళ్లయినా పార్టీపై ఇంతో కొంతో వుండనే వుంటుంది. అందుకే కెకె లాంటి తెలివైన నాయకులు, రాజకీయ భవిష్యత్ కోసం మళ్లీ సోనియా పాదాల చెంతనే వాలుతున్నారు.. ‘మమ్మీ’ (ఇటలీ అమ్మ కదా) శరణం గచ్ఛామి అంటున్నారు. వరుసపెట్టి తెలంగాణా నేతలనే దువ్వుతున్నారు. మొన్నటికి మొన్న ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లివచ్చారు. ఇప్పుడు దానం నాగేందర్ కు పిలుపు వచ్చింది. రాజకీయాలు తప్పదు మరి. సరియైన వేదికను వదిలేందుకు అంత సులువుగా మనసు రాదు మరి.