తెలంగాణ ఒక నిజం- సమైక్యాంధ్ర ఒక కల

madhu-yashkiహైదరాబాద్ ను తెలంగాణ నుంచి వేరే చేసే ఆలోచన కేంద్రానికి ఏమాత్రం లేదని, హైదరాబాద్ లేకుండా తెలంగాణ నిలదొక్కుకోలేదని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. తెలంగాణ ఒక నిజం.. సమైక్యాంద్ర ఒక కల అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఆగదని.. సోనియాగాందీ తెలంగాణ ఇచ్చి తీరుతారని యాష్కి అన్నారు. ఏపీ ఎన్జీవోల సభ తర్వాత ముఖ్యమంత్రిని ఆంధ్రా సీఎంగానే భావిస్తున్నామని ఆయన అన్నారు. విజయవాడ ఎంపి లగడపాటివి ఉత్తమకుమార ప్రగల్భాలు అని యాష్కి అన్నారు.