Site icon TeluguMirchi.com

లోక్ సభ వాయిదా..!

lokhsabhaపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమైక్య నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. సమావేశం ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా ఎంపీలు తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడలంటూ.. ఆందోళనకు దిగారు. సమైక్య నినాదాలతో సభ మారుమోగుతోంది. మరోవైపు బోడాల్యాండ్ ప్రత్యేక రాష్టం కోసం ఆ ప్రాంత ఎంపీలు సభలో నిరసనలు చేపట్టారు. సభ్యులు ఎంతకు శాంతించకపోవడంతో.. స్వీకర్ మీరా కుమార్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Exit mobile version