లోక్ సభ రేపటికి వాయిదా!!

lok-sabha_398_080911043849లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన సభ 12గంటలకు వాయిదా
పడినపడిన విషయం తెలిసిందే. వాయిదా అనంతరం సమావేశమయిన సభలో సేమ్ సీన్
రిపీట్ అయింది. సీమాంధ్ర ఎంపీలు స్వీకర్ పోడియాన్ని చుట్టిముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ రచ్చ రచ్చ చేశారు. దీంతో.. సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ సాగే పరిస్థితి కనబకపోవడంతో.. స్వీకర్ సభను రేపటి వాయిదా వేశారు. మరోవైపు, రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సీమాంధ్ర ఎంపీల నిరసనలతో సభ మరోసారి వాయిదా పడింది. తిరిగి 2గంటలకు రాజ్యసభ మరోసారి ప్రారంభం కానుంది.