తెలంగాణ రైతులపై వివక్ష : హరీష్

T-Harish-Raoపోలవరం భూసేకరణలో రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని టీఆర్ ఎస్ ఆరోపించింది. టీఆర్ ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ.. ఆంధ్రా రైతుకు ఎకరానికి 3.5 లక్షల పరిహారం చెల్లిస్తున్న కిరణ్ ప్రభుత్వం అదే తెలంగాణ రైతుకు మాత్రం 1.5 లక్షల మాత్రమే చెల్లిస్తుంది. అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు.. తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి.. నిలదీయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు హారీష్ వెల్లడించారు.