ఆఖరి ఆశగా.. !

Pranab-Mukherjeeవిభజన విషయంలో తమను ఏమాత్రం ఖాతరు చేయకుండా కేంద్రం ముందుకెళ్లడంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… ఆఖరు ఆశగా.. రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఆశ్రయించాలని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. విభజన విషయంలో.. నిబంధనలు, సాంప్రదాయాలను పట్టించుకోకుండా అడ్డగోలుగా కేంద్రం ముందుకు వెళ్తోందని నేతలు దాదాకు ఫిర్యాదు చేయనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీయే.. కాంగ్రెస్ నేతలను ఖాతరు చేయని టైమ్ లో.. తమ సర్కార్ పై.. ఒకప్పుడు కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా వుండి.. ఇప్పుడు పెద్దన్న పాత్రలో (రాష్ట్రపతి)గా వున్న ప్రణబ్ ముఖర్జీకి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనుండటం విశేషం. మరి రాష్ట్రపతి అయినా.. వీరి గోడును ఆలకించి న్యాయం చేసేలా చూస్తారేమో వేచి చూడాలి..