Site icon TeluguMirchi.com

కనువిప్పు కొనసాగుతుంది : లగడపాటి

lagadapatiతెలుగు రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర నేడు ఈరోజు కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తున్నా నేపథ్యంలో… సమైక్యవాదానికి మద్దతు తెలపాలంటూ.. లగడపాటి కనువిప్పు యాత్రకు సిద్ధం కావడంతో ఆయనను పోలీసులు హైడ్రామ మధ్య కృష్ణాజిల్లా అనుమంచిపల్లిలో ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జిల్లాలోని అనుమంచిపల్లిలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ హైడ్రామాకు తెరపడింది.

ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వేర్పాటువాదులకు వెన్నులో చలి పుట్టించేందుకు కనువిప్పు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అరెస్ట్ లతో సమైక్య ఉద్యమం ఆగదని లగడపాటి స్పష్టం చేశారు.. ఆరు గంటల తర్వాత నివాసం నుంచి బయటకు వచ్చిన లగడపాటిని పోలీసులు అరెస్టు చేశారు. కనువిప్పు యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు పదేపదే పోలీసులకు ఫోన్ చేశారని లగడపాటి తెలిపారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. అరెస్టు చేసిన అనంతరం లగడపాటిని పోలీసులు విజయవాడకు తరలించారు.

Exit mobile version