ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వేర్పాటువాదులకు వెన్నులో చలి పుట్టించేందుకు కనువిప్పు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అరెస్ట్ లతో సమైక్య ఉద్యమం ఆగదని లగడపాటి స్పష్టం చేశారు.. ఆరు గంటల తర్వాత నివాసం నుంచి బయటకు వచ్చిన లగడపాటిని పోలీసులు అరెస్టు చేశారు. కనువిప్పు యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు పదేపదే పోలీసులకు ఫోన్ చేశారని లగడపాటి తెలిపారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. అరెస్టు చేసిన అనంతరం లగడపాటిని పోలీసులు విజయవాడకు తరలించారు.