రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిందనే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయని, ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సివుందని ఎంపీ లడగపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో లగడపాటి నివాసంలో ఈరోజు (బుధవారం) ఉదయం సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశమనంతరం రాజగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. హైపవర్ కమిటీ నిర్ణయం వచ్చేదాకా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ముందుకు జరగదని స్పష్టం చేశారు. పార్లమెంట్ కమిటీపై మరింత సమాచారం సేకరిస్తామని ఆయన తెలిపారు. పార్లమెంట్ లో నిరసన తెలిపే అంశంపై చర్చించామని, సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు.