లగడపాటి ఆత్మాహత్యా యత్నం!!

Lagadapatiఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆత్మాహత్య యత్నం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన సమయంలో.. ద్రవ పధార్థాన్ని సభలో పోసినట్లు సమాచారం. దాని వల్ల విపరీతమైన వాసన, పొగ రావడంతో.. ఎంపీలు బయటికి పరుగులు తీసినట్లు సమాచారం. అంతేకాకుండా లగడపాటి కత్తితో పొడుచుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు, టీ-బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న లగడపాటిని టీ-ఎంపీలు పై చేయి చేసుకున్నట్లు సమాచారం. లగడపాటి అపస్మారక సితిలోనికి వెళ్లినట్లు తెలుస్తోంది. మోదుగుల వేణు గోపాలపై కూడా టీ-ఎంపీలు చేయిచేసుకున్నట్లు సమాచారం. మొత్తానికి పార్లమెంట్ ఆవరణలో గందరగోళ వాతావరణం నెలకొంది.