జైపాల్ రెడ్డికి లగడపాటి లేఖ !

lagadapatiకేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రేఖ రాశారు. విభజన నేపథ్యంలో.. భద్రాచలంపై ఇరు ప్రాంతాల మధ్య తలెత్తిన విభేదాలకు సంబంధించిన విషయాలను ఈ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం బాధ కలిగించిందని లగడపాటి లేఖలో పేర్కొన్నారు. దేవుళ్లందరినీ వదిలి ఒక్క భద్రాద్రి రామయ్య చాలు అనుకోవడంలో మీ లౌకిక సూత్రం ఏమిటని ప్రశ్నించారు. దేవుళ్లు, దేవాలయాలకు మధ్య కూడా గోడలు కట్టే వాదం మీకు తగదని లగడపాటి లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ కృతజ్ఞత సభలో ’దేవుళ్లందరినీ వదిలిన.. ఒక్క భద్రాద్రి రామయ్య చాలని’ జైపాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. లగడపాటి సంధించిన లౌకిక సూత్రంపై కాంగ్రెస్ కురవృద్దుడు జైపాల్ ఏవిధంగా స్పందిస్తారో..