Site icon TeluguMirchi.com

ఇది ప్రజా ఉద్యమం !

lagadapatiసమైక్య ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విజయవాడలోని బందర్ రోడ్డులో సమైక్య విద్యార్థి జేఏసీ గర్జనలో లగడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ.. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించాలని, శాంతియుత ఉద్యమం ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు శిలాశాసనాలు కాదని, ప్రజాభిప్రాయానికి తలొగ్గి తీరాల్సిందే ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version