విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తండ్రి వెంకటరమణనాయుడు ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నతున్నారు. హైదరాబాద్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో గతకొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. కాగా, లడపాటి తండ్రి మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.