సన్యాసమా.. ? బ్రహ్మాస్త్రమా… ?

lagadapati_695410eరాష్ట్ర విభజనను ఆపడానికి ఎలాంటి త్యాగాలకైనా.. వెనుకాడబోమని సీమాంధ్ర నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, సీమాంధ్ర నేతలకు భిన్నంగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్ ఓ ప్రకటన చేశారు. అదేటంటరా.. అదేనండీ తన బ్రహ్మాస్త్రం గురించి. అవసరమైతే రాష్ట్ర విభజనను ఆపడానికి తన వద్ద వున్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తానని లగడపాటి పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానికి కూడా ఆయన అనడం గమనార్హం. అధిష్టానం రాష్ట్రాన్ని విభజిస్తుందనుకోవడం లేదని లగడపాటి మరోసారి పాత పాటే పాడారు. కాగా, గతంలో.. ఒకవేళ విభజనే జరిగితే.. రాజకీయ సన్యాసం చేస్తామని కూడా లగడపాటి ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రహ్మాస్తంను ప్రయోగించి విభజనను అడ్డుకుంటుడా..? లేదా విభజన అనంతరం రాజకీయ సన్యాసం స్వీకరిస్తాడా వేచి చూడాలి మరీ. ఆ బ్రహ్మాస్తమేదో.. విభజన ప్రకటన రాకముందు ప్రయోగిస్తే బాగుణ్ను అనుకుంటున్నారు సీమాంధ్ర నేతలు. లగడపాటి వ్యాఖ్యలు చూస్తుంటే.. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు వున్నాయని విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు.