కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య !

Siddaramaiahకర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్ఠానం తెరదించింది. పార్టీ పరిశీలకుడిగా బెంగళూరు వచ్చిన కేంద్రమంత్రి ఏకే ఆంటోని కొద్దిసేపటి క్రితం సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా ప్రకటించారు. కాగా, ముఖ్యమంత్రి పదవికి రేసులో సీనియర్ నేతలు సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గేలు ఉన్నప్పటికినీ.. అత్యధిక ఎమ్మెల్యేలు మరియు రాష్ర్ట ఎంపీలు సైతం రామయ్య అభ్యర్థిత్వాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 స్థానాలకు గాను 121 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే