హైదరాబాదును వైఫై సిటీగా మార్చాలని నిర్ణయించామని… దీనికోసం సిటీలో అనేక సెల్ ఫోన్ టవర్లు అవసరమవుతాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనికితోడు, త్వరలోనే 10వేల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘సెల్ టవర్లు, ఆరోగ్యం’ అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ తగిన మోతాదులో ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.